72
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు స్యూరిటీ, పవన్ కళ్యాణ్ సిన్సియారిటీతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రాభివృధ్ధి కోసం అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు.