Home » ఏపీ పూర్వవైభవానికి తొలి అడుగు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – Sravya News

ఏపీ పూర్వవైభవానికి తొలి అడుగు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – Sravya News

by Sravya Team
0 comment
ఏపీ పూర్వవైభవానికి తొలి అడుగు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్


ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన కూటమి పోస్ట్ చేసిన ఆయన.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేయడం ఆనందంగా కార్యక్రమం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేయడం శుభ పరిణామంగా ఆయన పేర్కొన్నారు. సామాజిక పింఛన్లు నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్‌లో పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం, నైపుణ్యాలను గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు ఆసక్తికర సెన్సెస్‌పై ఐదో సంతకం చేయడం గొప్ప విషయం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని, రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలిపినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యత స్వీకరించాల్సి ఉందని, శాసనసభ సమావేశాలు ఉన్నాయని, వీటిని పూర్తిచేసుకుని పిఠాపురం వస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెల 20 తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని, ఆ తరువాత దశల వారీగా గ్రామాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలో వారందరినీ జిల్లాల వారిగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు. అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, సాలువాలు తీసుకురావద్దు అని విజ్ఞప్తి చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in