వైయస్ జగన్ రెడ్డి పై ఇష్టానుసారంగా వైయస్ ఆత్మ క్షోభకుమోహన్ మాట్లాడుతూ షర్మిలారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారని, అయితే ఆ కన్నీళ్లు ఎవరికోసం పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. వైయస్ ఆత్మ క్షోభకు అనుకూలంగా నటించామంటూ. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారని భావించడం తగదన్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీని అమలు చేయడంలో విఫలమై ఇటువంటి రాజకీయాలకు అందిస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను ఇలా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డికి షర్మిల రాసిన లేక టిడిపి నేతలు వద్దకు ఎలా చేరిందంటూ విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా టిడిపి నాయకులు, ఆ పార్టీకి చెందిన మీడియా ఉంటే మీరు ప్రేక్షక పాత్ర పోషించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే మీ ఇద్దరి మధ్య ఎంఓయు కుదిరి విషయం వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. తన ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి 40 శాతం ఇచ్చేందుకు ముందుకు వచ్చి ఎంవోయు కుదుర్చుకున్న మాట నిజం కాదా.? అని ప్రశ్నించారు. చెల్లికి ఇవ్వాలి అనుకోబట్టే ఆయన అలా చేశారు, ఆ ఎంఓయులో కూడా నిబంధనలను స్పష్టంగా చెప్పినట్లుగా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన వ్యక్తితో కలవడం, కుట్రలు చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. కోర్టు కేసులు పూర్తయిన తరువాత ఆస్తుల పంపకాలు జరగాలన్న విషయం షర్మిలకు తెలియదని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు, మీరు చేసిన కుట్ర కాదా అని ఈ సందర్భంగా విజయసాయి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానీయకుండా చేయడమే మీ ఇద్దరు లక్ష్యంగా ఉందని. రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఆయన బతికుండగానే కొడుకు, కూతురు పంపకాలు చేశారన్నారు. చంద్రబాబుతో కలిపిన చేతులు విడిచిపెట్టాలని, అతడు దుర్మార్గుడని. మానవజన్మ ఎత్తేందుకు కూడా అర్హుడు కానీ చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేయడం దుర్మార్గమని.
అక్టోబర్ 31వ తేదీనా.. నవంబర్ 1వ తేదీనా.. దీపావళి ఏ రోజంటే..
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్