Home » సింగరేణి ఏరియా లో బతుకమ్మ సంబురాలు..

సింగరేణి ఏరియా లో బతుకమ్మ సంబురాలు..

by v1meida1972@gmail.com
0 comment

రుద్రంపూర్ లోని ప్రగతి వనం వద్ద ఫ్యామిలీ డే, బతుకమ్మ ఆటపాట సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా పరిసర ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎం. షాలేం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో బతుకమ్మలను తీసుకొచ్చిన వారికి పోటీలను నిర్వహించి బహుమతులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ తోపాటు శ్రీమతి జి.మధురవాణి శాలెం రాజు, కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జే.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, కొత్తగూడెం అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి నరసింహారావు, తదితరులు పాల్గోన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in