Home » ఏపీలో మద్యం ఉత్పత్తులకు భారీగా డిమాండ్.. ప్రభుత్వానికి 18 వేల కోట్లు – Sravya News

ఏపీలో మద్యం ఉత్పత్తులకు భారీగా డిమాండ్.. ప్రభుత్వానికి 18 వేల కోట్లు – Sravya News

by Sravya Team
0 comment
ఏపీలో మద్యం ఉత్పత్తులకు భారీగా డిమాండ్.. ప్రభుత్వానికి 18 వేల కోట్లు


ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అమలు చేయబోతున్న మద్యం విధానంలో భాగంగా మద్యం షాపులను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంది. దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం నాన్ రిఫండబుల్ గా ప్రదర్శించబడింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచాయి. ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని విక్రయించడంతో పాటు ధరలు భారీగా పెంచడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందించడంతోపాటు తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మధ్యము విధానంపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ అందుబాటులోనే మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవసరమైన నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ముందుగా ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచింది. ఈ నేపథ్యంలోనే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు కోట్ల కారణంగా ప్రభుత్వానికి 1800 రూపాయలు ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో 113 పరికరాల కోసం 6000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా దరఖాస్తుల్లో ఎన్ని అర్హత ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. అన్ని సక్రమంగా ఉంటే వాటిని తరువాత దశ ఫిల్టర్ వేషం కోసం పంపించమన్నారు మిగిలిన వాటిని తిరస్కరిస్తారు.

అర్హత ఉన్న వాటిని 14వ తేదీని లాటరీ తీసి షాపులను కేటాయించనున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా షాపులను వేలం వేసి కేటాయించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తి చెప్పింది. దీనితో దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ నూతన మద్యం ఉత్పత్తుల కోసం వేలం చేసే ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దరఖాస్తుకు 10వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకుండా మరో రెండు రోజులు పెంచింది. మొదట్లో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకడంతో దరఖాస్తులు మళ్లీ భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం ఉత్పత్తుల కోసం సుమారు 90,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 14వ తేదీన అధికారులు లిక్కర్ షాపుల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తులను లాటరీ తీయనున్నారు. లాటరీలో దుకాణాలు పొందిన యజమానులకు 15వ తేదీ నుంచి సర్టిఫికెట్లను అధికారులు అందిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నూతన మద్యం విధానం వల్ల సుమారు 180 కోట్ల రూపాయల ఆదాయం రావడం పట్ల ప్రభుత్వ హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.

ఆరోగ్యానికి మేలు చేసే నల్ల మిరియాలు.. తీసుకుంటే ప్రయోజనాలు ఎన్నో.!
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in