51
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం-పచ్చ ధనం కార్యక్రమంలో జగిత్యాల పురపాలక శాఖ వారి ఆద్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పరెడ్ మైదానంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీం రావ్, డీఎస్పీ రఘు చందర్, కమిషనర్ సమ్మయ్య,స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, సి ఐ కృష్ణ రెడ్డి,AO శ్రీనివాస్, కౌన్సిలర్ లు, నాయకులు, ఎస్ఐ లు, ఆర్ఐలు, అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.