61
పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఓ బైక్ ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతలా గ్రామానికి చెందిన కృష్ణయ్య, సింహాద్రి మండలానికి చెందిన కిట్టయ్య అక్కడికక్కడే మృతి చెందారు.