36
విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ని రాష్ట్ర హోం మంత్రి అనిత పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గంజాయి సంస్కృతి రాష్ట్రంతో పాటు, విశాఖ నగరంలో పెరిగిందని, ఈ ప్రమాదం నుంచి, యువతని, రాష్ట్రాన్ని కాపాడేలా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పకడ్బందీగా పనిచేస్తామని తెలిపారు.