Home » ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు.... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఏపీలో ఇంత‌కుముందు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప‌లు ప‌థ‌కాల పేర్ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మార్చిన విష‌యం తెలుస్తుంది. ఇదే కోవలో ఇప్పుడు మరో పథకం పేరు మార్చబడింది. జ‌గన్ సర్కార్ అమ‌లు చేసిన ‘శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ’ ప‌థ‌కం పేరును ‘ఏపీ రీ స‌ర్వే ప్రాజెక్టు’గా మార్పు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తాజా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, ఈ స్కీమ్ ను గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువెళ్లామని అప్పట్లో జగన్ ప్రభుత్వం. భాగంగా భూములు స‌మ‌గ్ర రీ స‌ర్వే చేప‌ట్టారు. కానీ, ఈ ప‌థ‌కం ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి భారీ ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. వీరితో బాధితులు ‘శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ’ ప‌థ‌కంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ నేపథ్యంలో, ఈ స్కీమ్ అమలు తీరును అప్ప టి ప్ర తిప క్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వ‌స్తే ఈ స్కీమ్‌ను పూర్తిగా ప్ర‌క్షాళన చేయ‌డం జ‌రుగుతుంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ‘శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ ప‌థ‌కం’ పేరు మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in