Home » ఈ నెల 20 నుంచి కాళేశ్వరం విచారణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఈ నెల 20 నుంచి కాళేశ్వరం విచారణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
ఈ నెల 20 నుంచి కాళేశ్వరం విచారణ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఈ సారి ఐఏఎస్ లు, మాజీ ఐఏఎస్ లను విచారించనున్న కమీషన్
  • రెండు వారాలు హైదరాబాద్ లోనే చంద్రఘోస్
  • నెలాఖరు వరకు డిసెంబర్ ప్రభుత్వానికి నివేదిక

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల అవినీతిపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమీషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విచారణలో భాగంగా న్యాయమూర్తి పీసీ ఘోష్ రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే ఉంటారు ఈ నెల 20 నుంచి ఐఎస్‌లు, మాజీ ఐఎస్‌లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. కమీషన్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించేందుకు డిసెంబర్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే జీవో జారీలో ప్రభుత్వం జాప్యం చేయడంతో విచారణ రెండు వారాలు ఆలస్యమైంది. ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించగా… కమీషన్ గడువు ఈ నెల 13న పొడిగిస్తూ ప్రభుత్వం మెమోరాండం విడుదల చేసింది. జీవో 13 రోజులుగా న్యాయమూర్తి పీసీ ఘోష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈల క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పటికే పూర్తయింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in