50
వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఏ.ఎస్ఐ మల్లేశం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మర్పల్లి ఏ ఎస్ఐ మల్లేశం మాట్లాడుతూ.. చరవాణి లకు( సెల్ ఫోన్లు ) అనధికారికంగా బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని.. మీ పాన్ కార్డు వివరాలు తెలపాలని.. వాట్సాప్ మెసేజ్ రూపంలోక్ ఒక లింకు ను సైబర్ నేరస్తులు పంపుతున్నారని.. ఈ లింక్ ను ఓపెన్ చేయకూడదని తెలిపారు.