37
చత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగిన మావోయిస్టు బాంబు దాడి లో మృతి చెందిన కడప జిల్లా పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వీర జవాన్ కొడవటిగంటి రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అతిథి సింగ్ తెలిపారు. ఈ విషయంపై మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు
పుట్టా సుధాకర్ యాదవ్ కలిసి చర్చించగా, ప్రభుత్వం తరపున బాధితురాలికి ఉద్యోగం, భూమి కేటాయింపు, ఆర్ధిక సహాయం అందేలా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వటం జరిగింది.