Home » భక్తిశ్రద్ధలతో శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట..

భక్తిశ్రద్ధలతో శ్రీ అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట..

by v1meida1972@gmail.com
0 comment

కలికిరి మండలం కొర్లకుంట బోయపల్లి బెస్తపల్లి వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుండి శివాలయం ఆర్చకలు శివకుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పుణ్యాహవ వచనం, గణపతి పూజ గంగపూజ, నవగ్రహ పూజ, రక్షాబంధనం హోమాలు నిర్వహించారు. మూడు రోజుల కార్యక్రమాలు పూర్తయితాయని ఆలయ వ్యవస్థాపకులు, ఈ సందర్భంగా గ్రామస్తులు రామలింగారెడ్డి, సురేష్ బాబు శ్రావ్య టీవీ న్యూస్ తో మాట్లాడుతూ.. గ్రామ దేవత అంకాలమ్మ తల్లి నిర్మాణం చేపట్టామని గ్రామస్తులందరూ శ్రేయస్సు కోసం.. లోక శ్రేయస్సు కోసం లోకం సుభిక్షంగా ఉండాలని ఎటువంటి అనారోగ్యాలు దరి చేరకుండా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అందరూ ఈ మూడు రోజులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీ వ్యవస్థాపకులు అధ్యక్షుడు రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు, కోశాధికారి గోపాల్, కార్యదర్శులు సురేష్, కమిటీ సభ్యులు రామలింగారెడ్డి, కృష్ణప్ప నాయుడు, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in