Home » ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి – సిపిఐ మండల కార్యదర్శి దుర్గయ్య – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి – సిపిఐ మండల కార్యదర్శి దుర్గయ్య – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి - సిపిఐ మండల కార్యదర్శి దుర్గయ్య - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్రణ, తుర్కపల్లి:-తుర్కపల్లి మండల కేంద్రంలోని 213 సర్వే నెంబర్లలో కొందరు చేపడుతున్న అక్రమాలను కూల్చివేయాలని, పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ మండల కార్యదర్శి సిలివేరు దుర్గయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రాన్ని 213 సర్వేలో అనేక ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఇప్పటికైనా కబ్జాకు వస్తున్న ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాలని తెలిపారు.

తహసీల్దార్ కార్యాలయం ఎదురుగానే మాజీ సింగిల్ విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్. కె హాస్పిటల్ కృష్ణలు అక్రమ నిర్మాణాలను చేపట్టారని, వాటిని వెంటనే కూల్చి చేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్న స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని తెలిపారు. అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోని యెడల ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in