వరద బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఆహారం పంపిణీ సరిగా జరగలేదని, అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు సరిగా స్పందించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. నగరంలో డివిజన్కు ఒక సీనియర్ ఐఎస్ అధికారిని నియమించామని చంద్రబాబు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పది జిల్లాల నుంచి ఆహారాన్ని సమకూర్చామని, బాధితులకు మూడు పూటలా అందించాలని స్పష్టం చేశారు. చివరి బాధితుడికి సాయం అందాలని. బాధితులకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం లేదని తెలియజేసారు. వరదలతో పేదల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేలు వచ్చాయని వివరించారు. అధికారులంతా మానవతా దృక్పథంతో పనిచేయాలని, అందుతున్న ఐవిఆర్ఎస్ని అందుబాటులో ఉంచామని. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆహారం అందని బాధితుల నంబర్లు అధికారులకు పంపిస్తున్నామని, ఇబ్బందులపై ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు చెప్పారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. అధికారులకు రెండు రోజులుగా చెబుతున్నామని, అయినప్పటికీ సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని, మీనమేషాలు లెక్కించడం సరికాదని స్పష్టం చేశారు.
కుట్రలు జరుగుతున్నాయన్న చంద్రబాబు..
ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా.? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ లో బోట్ల ఘటనపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. బాబాయిని చంపిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అని జగన్ ను ఉద్దేశించి ఉండవచ్చు. విపక్ష నేత ఐదు నిమిషాలు షో చేసి వెళ్లిపోయారని, ఆయన ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వండి. ప్రధాన మోడీ తో మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు కదా భయం అని చెప్పారని, కొద్దికొద్ది సమయంలో తన పనితీరు ఆయన మెచ్చుకున్నారు. తన పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారని చంద్రబాబు అన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా సితార సెంటర్ కు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
ఆశు రెడ్డి | అభిమానులకు అశ్విని రెడ్డి అలియాస్ ఆశు రెడ్డి పరువాల విందు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్