Home » స్పీకర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అనుచిత పోస్టులు పెట్టిన దుండగులు

స్పీకర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. అనుచిత పోస్టులు పెట్టిన దుండగులు

by v1meida1972@gmail.com
0 comment

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైనది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు మితిమీరిపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడి సామన్యుల ఖాతాలను దోచుకోవడమే గాక.. సోషల్ మీడియాలో ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి వారికి సంబందం లేని పోస్టులు పెడుతుంటారు. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతాను కూడా హ్యాక్ చేసి, ఆయనకు సంబందం లేని పోస్టులు పెట్టారు. వెంటనే గుర్తించిన ఆయన టీం.. హ్యకింగ్ నుంచి రక్షించి హ్యాకర్లు పెట్టిన పోస్టులను తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సూచన అంటూ.. ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) అకౌంట్ కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయిందని, మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారని తెలిపారు. నా ఎక్స్ హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్‌లకు తనకు సంబంధం లేదని గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in