Home » ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థుల మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థుల మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థుల మృతి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని లారీని కారు ఢీకొంది.మృతులు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా పేర్కొన్నారు.

శనివారం రోజు కావడంతో తిరువళ్లూరు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గిద్దలూరు నితీష్ (ప్రొద్దుటూరు), బన్ను నితీష్ (విజయవాడ), యుగేశ్ (తిరుపతి), చేతన్ (తిరుపతి), రామ్మోహన్ (కర్నూలు)లు మృతి చెందగా, చైతన్య (ప్రకాశం), విష్ణు (నెల్లూరు)లకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన ఇద్దరు విద్యార్థులను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. వీరంతా చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in