Home » అసెంబ్లీకి రాణి కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

అసెంబ్లీకి రాణి కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 అసెంబ్లీకి రాణి కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • సీఎం పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు సరికావు
  • అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ముద్ర, తెలంగాణ,బ్యూరో : ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలన తీరు గురించి మాట్లాడాలంటే ముందు సభకు రావాలని సూచించారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణాస్త్రాలు సంధించారు.

పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసారని విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ పద్దుపై చర్చను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని, దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులో పాత సాంకేతిక పరిజ్ఞానంతో, ఎప్పుడో పక్కన పడేసిన పాత మోటార్లను ఉపయోగించారని ఆక్షేపించిన రాజగోపాల్ రెడ్డి, ఆ విద్యుత్ ప్రాజెక్టు నిత్యం ఏదో ఒక షట్ డౌన్ అవుతుందని అధికారులు బయట పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇవ్వడంతో పాటుగా ఇష్టానుసారంగా అంచనాలు పెంచి బీహెచ్‌ఈఎల్‌కు 20 వేల కోట్ల విలువైన పనులు ఇచ్చారని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in