- చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తేగలుగుతుంది..!
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక.!
- ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో జయశంకర్ బడిబాట ప్రారంభించిన కలెక్టర్.!
- విద్యార్థులకు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు అందజేత..!
ముద్ర, షాద్ నగర్: జీవితంలో చదువు మాత్రమే మనిషికి గొప్పగా మారుతుందని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి ఎదిగానని జిల్లా కలెక్టర్ శశాంక ప్రభుత్వ పాఠశాల విద్య గురించి గొప్పగా వివరించారు ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ ఖర్చుతో లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రైవేట్ విద్యాలయాల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే మంచి బోధన లభిస్తుందని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వాలు అందజేస్తున్నాయని ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశిందర్ రావు ఫారూక్ నగర్ మండలఈవో శంకర్ రాథోడ్ జెడ్పీటీసీ వెంకట్ రామిరెడ్డి.