Home » ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో బిగ్ షాక్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో బిగ్ షాక్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో బిగ్ షాక్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



విశాఖ జిల్లా భీమిలీ తీరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీకే అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఐసీ అధికారులు కూల్చేస్తున్నారు. భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళిక అధికారి బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీసీ అధికారులు ఉదయం 7 గంటల నుంచే బీచ్‌ ఒడ్డున హోటల్‌ కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు.

కూల్చివేతల సందర్భంగా అక్కడ పోలీసులు బారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను ఎవరూ అడ్డుకోవడం లేదనీ.. దీంతో కూల్చివేతలు సజావుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందనీ.. బుధవారం సాయంత్రం వరకూ ఇది పూర్తవుతుందని జీవో అధికారులు తెలిపారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలో పార్టీ ముఖ్యనేతలు ఇక్కడి భూములను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో.. జీవీసీ అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు. భీమిలి తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు న్యాయస్థానం నిర్ధరించింది. వీటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in