Home » రామానుజ సేవా ట్రస్టు, జనహిత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రామానుజ సేవా ట్రస్టు, జనహిత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
రామానుజ సేవా ట్రస్టు, జనహిత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారం, ఎస్టీపీ అంబర్ పేట్ కార్మికుల కోసం, శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. గురువారం నిర్వహించిన ఈ జలమండలి మేనేజింగ్.అశోక్ రెడ్డి, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ , ఎస్టీపీ జి.ఎం సుబ్రమణ్యం, జలమండలి ఆఫీసర్ పీఏ మహేష్ కుమార్, రామంతపూర్ డివిజన్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ వైద్యులు ఉన్నారు.

దాదాపు మూడు వందల మందికి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, ఇసిజి పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్యాన్ని తెలుసుకుని, వారికి సరిపడ మందులను నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్టీపీ జీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు, ఇలాంటి వైద్య శిబిరాలు మరి కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ వైద్య శిబిరం సహకరించిన కిమ్స్ ఆసుపత్రి, భారత్ వికాస్ పరిషత్ వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరం విజయవంతం అయిందని, సేవకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేసిందని శ్రీ రామానుజ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in