38
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాని మహిళా అఘోరీ దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి దర్శనం అనంతరం అఘోరి మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం.. ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నానని, గో హత్యలు ఆపాలని, ఆడపిల్లల మీద దాడులు అరికట్టాలని అఘోరి కోరారు. దమ్ముంటే నన్ను ఆపుకోండి.. ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పొస్తుంది, సీఎం అయినా పీఎం అయినా నా ముందు ఎవరు పనికిరారు కంపల్సరీ ఆ పదవులు లేకుండా చేస్తానన్ని అఘోరి హెచ్చరించింది.