ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి ఉషు( WUSHU )68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ (SGFTS) మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా స్టేడియం గ్రౌండ్ లో అండర్ 14 ఇయర్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కరాటే, ఉషు (WUSHU ) విభాగంలో నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని భాష్యం గ్రామర్ స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని.. ప్రిన్సిపల్, యాజమాన్యం వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడారంగంలో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన విద్యార్థులను ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం సన్మానించారు.
రాష్ట్రస్థాయి ఉషు (WUSHU ), కరాటే పోటీలకు భాష్యం గ్రామర్ స్కూల్ విద్యార్థుల ఎంపిక..
46
previous post