ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాద్ జిల్లాల నుంచి మద్దిశెట్టి అభిమానులు భారీ సంఖ్యలో మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ.. ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించారని, అలాగే ఏపీ, తెలంగాణ ,ఒరిస్సా, రాష్ట్రాలకు ఇన్చార్జ్ గా కూడా బాధితులు ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా సమస్యల కోసమే తన పోరాటమన్నారు. 2011లో నాగుపల్లి లో 270 మందికి భూమి పంపిణీ చేశానని ఆ విషయంలో నా పై రౌడీ షీట్ ఓపెన్ చేశారని, 2011 నుంచి హైకోర్టులో ఆ కేసు నడుస్తుంది అన్నారు. తనపై లేనిపోని కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. పూసల కులస్తుండని అంటరాని వాడినని, నా ఎదుగుదలను ఓర్వలేక నాపై కేసులు బనాయిస్తున్నారు అని, ఒక వ్యక్తి నమ్మి మోసపోయానని, దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానన్నారు. తాను బ్రతికున్నన్ని రోజులు మీకు పెద్ద కొడుకుల పని చేస్తా అన్నారు. ప్రజల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ఆరు జిల్లాలలో 670 గ్రామాలలో గిరిజన పూజారులు నాలుగు సంవత్సరాలుగా 1750 మంది పూజార్లు పోరాటం చేస్తున్నారని, వారి ఆవేదన ప్రభుత్వంనికి గుర్తు లేదా అన్నారు. ఈనెల అక్టోబర్ 6న రాష్ట్రపతికి వినతి పత్రం పంపించానని రెండు రోజుల్లోనే దానికి వారు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య పరిష్కరించాలని ఆర్డర్ పంపించారన్నారు. 300 సర్పంచులను గెలిచి రాష్ట్ర నాయకులు రామ్ కుమార్ వాల్యకు కానుక ఇస్తా అన్నారు. నన్ను నమ్ముకుని 9 సంవత్సరాలుగా నా వెంట ఉంటున్న రెండు లక్షల మందికి ఏలాంటి పనిని చేయలేకపోయాను అని అన్నారు. పూజారుల సమస్య, ఇండ్లసమస్య, గ్రామ మౌలిక వసతులు గురించి వారం రోజుల్లో రాష్ట్రపతి అపార్ట్మెంట్ తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత మోర్చా కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ మాజీ డాక్టర్ చినరాములు, స్వర్ణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, ముక్తి మల్లేష్, ఖానోత్ రవి, రాందాస్, ఐలయ్య, మండల సమ్మయ్య, రమేష్, మద్దిశెట్టి అజయ్ బాబు, ఇతర జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మదిశెట్టి అభిమానులు పాల్గొన్నారు..