68
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ కారులో ఆయన ఉన్నందున ఎమ్మెల్యే బాలరాజుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇక వెంటనే కారులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి పరిశీలన ఎమ్మెల్యే బాలరాజు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.